Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదు.. స్వయంగా అనుభవించా : నరేంద్ర మోడీ

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (12:47 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా, పేదిరికంపై మాట్లాడుతూ, తాను పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదనీ, స్వయంగా అనుభవించినట్టు చెప్పారు. 
 
రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటన కోసం మోడీ ఈ నెల 28వ తేదీన వెళ్లిన విషయం తెల్సిందే. ఈ పర్యటనను ముగించుకుని బుధవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్నారు. అయితే, రియాద్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. 
 
'తాను పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదని, దాన్ని స్వయంగా అనుభవించానని మోడీ చెప్పారు. ఒకప్పుడు తాను రైల్వే ప్లాట్ ఫాంపై టీ అమ్ముకున్నానని, ఇప్పుడు ఇక్కడిదాకా వచ్చానని గుర్తుచేశారు. 
 
తాను గౌరవంగా బతికానని, తనకు పేదలంటే గౌరవమని తెలిపారు. వారికి సాధికారత లభించినప్పుడే దేశంలో పేదరికం అంతమవుతుందన్నారు. భారత్‌లో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు ప్రతి ఒక్కరితో బ్యాంకు ఖాతాలు తెరిపించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తున్నామని, వీటిద్వారా వారికి గౌరవం లభిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments