"నీట్" ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (14:10 IST)
దేశంలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల ప్రవేశాల కోసం జూలై 17వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
 
ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇందుకోసం వచ్చే నెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దేశంలో 543 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ విభాగాల్లో 50 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్షను నిర్వహించనుంది. 
 
ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం చొప్పున సమయాన్ని కేటాయించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా, 2022 నుంచి నీట్ పరీక్షను రాసేందుకు విద్యార్థుల్లో గరిష్ట వయోపరిమితిని కూడా ఎత్తివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments