"నీట్" ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (14:10 IST)
దేశంలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల ప్రవేశాల కోసం జూలై 17వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
 
ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇందుకోసం వచ్చే నెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దేశంలో 543 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ విభాగాల్లో 50 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్షను నిర్వహించనుంది. 
 
ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం చొప్పున సమయాన్ని కేటాయించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా, 2022 నుంచి నీట్ పరీక్షను రాసేందుకు విద్యార్థుల్లో గరిష్ట వయోపరిమితిని కూడా ఎత్తివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిష ఓ పరాన్నజీవి, ఆమె అంటే నాకు అస్సలు ఇష్టం లేదు: సుచిత్ర

Manchu Manoj: బండి భగీరథ్‌ పై పోక్సో కేసు తీవ్రంగా కలవరపరిచింది : మంచు మనోజ్

విజయ్ జీవితంలోకి కొందరు పరాన్నా జీవులుగా ప్రవేశించారు : సుచిత్ర

Ali: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

Nihal: వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సందిగ్ధం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments