Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్న కేంద్ర మంత్రి

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (12:13 IST)
గిరిరాజ్ సింగ్. ఈయన ఓ కేంద్ర మంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఈయన తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను అనుకున్న లక్ష్యాల్లో ఒకటి నెరవేరిందన్నారు. రెండోది నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. ఆ రెండు లక్ష్యాల్లో ఒకటి రామమందిర నిర్మాణమన్నారు. రెండోది తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడమన్నారు. 
 
ఇద అంశంపై ఆయన బీహార్‌లో మీడియాతో మాట్లాడుతూ, అయోధ్యలో శ్రీరామునిది దేవాలయం, జనాభా నియంత్రణ తన కెరీర్‌లో రెండు ప్రధాన లక్ష్యాలన్నారు. రామాలయం నిర్మించే సమయం వచ్చేసిందని, ఇది తనవంటి వృద్ధులు రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే, జనాభా నియంత్రణ చట్టం త్వరలోనే అమలులోకి వస్తుందని భావిస్తున్నానని, ఆపై రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, గతంలో పలుమార్లు జనాభా నియంత్రణపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముస్లింల కారణంగానే దేశంలో జనాభా పెరుగుతోందని, ఆ అంశమే తనను రాజకీయాలవైపు మళ్లించిందని ఆయన అంటుండేవారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments