Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావుగా ఉండే మహిళలు, యువతులే టార్గెట్.. కారు డ్రైవర్ ఘరానా మోసం

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (10:57 IST)
విశాఖపట్టణం నగరంలో ఓ కారు డ్రైవర్ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. పలువురు మహిళలు, అమ్మాయిలను మోసం చేసినట్టు వెల్లడైంది. ముఖ్యంగా, లావుగా ఉన్న మహిళలు, యువతులను టార్గెట్ చేసి, వారివద్ద లక్షలాది రూపాయలు గుంజుకున్నట్టు తేలింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ నగరంలో కంచరపాలెం ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా ఉన్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, తాను విశాఖలో పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యుడునంటూ, తన వద్ద ఉన్న ఫేక్ ఐడీ కార్డులతో మహిళలు, యువతులు పరిచయం చేసుకుంటాడు. 
 
ఉదయం పూట బీచ్ రోడ్డు ప్రాంతంలో నడిచే వాకర్స్‌ను టార్గెట్ చేస్తూ పరిచయం పెంచుకుంటాడు. లావుగా ఉన్నారని, డైట్ అవసరమని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. అలా పరిచయం అయిన వాళ్ళతో ఫేస్‌బుక్ ద్వారా కనెక్ట్ అవుతాడు. 
 
వారితో సాన్నిహిత్యం పెంచుకుని శారీరకంగా లోబర్చుకుని వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ వీడియోలతో బెదిరించి డబ్బు, నగలు అందినకాడికి దోచుకునేవాడు. అలా అజిత్ కుమార్ చేతిలో మోసపోయిన ఓ మహిళ స్పందన కార్యక్రమం ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో అతడి బండారం బయటపడింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments