యూపీలో ఘోరం.. My mother will die ఆక్సిజన్ కోసం ఓ కుమారుడు..?

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:36 IST)
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తల్లికి కరోనా సోకింది. ప్రైవేటు ఆసుపత్రిలో చేరిపించి చికిత్స చేయిస్తున్నాడు. అయితే..ఈ ప్రైవేటు ఆసుపత్రి నుంచి పోలీసుల బందోబస్తు మధ్య ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్నారు.
 
దీనిని తెలుసుకున్న ఆ వ్యక్తి ఆసుపత్రి బయటకు వచ్చి.. మోకాళ్లపై నిల్చొని దండం పెడుతూ ఆక్సిజన్స్ సిలిండర్లను తరలించవద్దని ప్రాథేయపడ్డాడు. ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళితే..తన తల్లి చనిపోతుందని, తాను ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించాడు.
 
తన తల్లిని ఆరోగ్యంగా ఇంటికి తీసుకొస్తానని..తన కుటుంబసభ్యులకు మాటిచ్చానని..దయచేసి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లవద్దని మోకాళ్లపై కూర్చొని దండం పెడుతూ ప్రాథేయపడ్డాడు. కానీ..పోలీసులు మాత్రం తమ పనిలో బిజీగా ఉన్నట్లు కనిపించారు. 
 
ఆక్సిజన్ సిలిండర్ ను తీయవద్దని పోలీసులను వేడుకోవడం కండ్లు చమర్చేలా ఉందని, యూపీ పోలీసుల తీరు అమానవీయమని ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ యూత్ కాంగ్రెస్ యోగి సర్కార్ పై విమర్శలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments