మోహన్‌లాల్‌‌పై ట్రోలింగ్.. బూట్లు.. నా.. తెచ్చుకున్నారా?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (19:13 IST)
2018కి గానూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల‌లో మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కేర‌ళ‌లో ర‌చ్చ జ‌రుగుతుంది. మలయాళ స్టార్ మోహన్ లాల్‌‌పై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 
 
40 ఏళ్ల పాటు ఇండస్ట్రీ ఉంటూ ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఆయన కేరళ సినిమాకు ఎంతో చేశారని, ఆయనకు కాకపోతే ఇంకెవరికి పద్మభూషణ్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. 
 
అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా జరుగుతున్న రచ్చ చూసి అంతా బాధ పెడుతున్నారు. పద్మ అవార్డ్ వచ్చినప్పుడు చక్కగా ఇండస్ట్రీ అంతా కలిసి ఆయనకు సన్మానించడం మానేసి ఇట్టి తిట్టి పోస్తారా.. అంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. 
 
కేర‌ళ‌లో ప్రేమ్ న‌జీర్ త‌ర్వాత ప‌ద్మ‌భూష‌ణ్ అందుకున్న న‌టుడు మోహ‌న్ లాల్ మాత్ర‌మే. అయితే ఆయ‌న బిజేపీకి ఊడిగం చేసి.. మోదీకి భ‌జ‌న చేసి ఈ అవార్డు తెచ్చుకున్నారంటూ చాలా దారుణ‌మైన ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇంకా కాలాపాణి సినిమాలో మోహన్ లాల్ బూట్లు నాకుతున్న ఫోటోలు పెట్టి.. పక్కనే మోదీని చూపిస్తూ మోహన్ లాల్ పరువు తీస్తున్నారు. 
 
గతంలో విశ్వ‌శాంతి కోసం చేస్తున్న ఉద్య‌మంలో భాగంగా ప్ర‌ధాని నరేంద్ర మోదీని మోహన్ లాల్ కలిసిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments