Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్రేయి ఆచూకీ లభ్యం.. అంతా సోషల్ మీడియా ఎఫెక్ట్

సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. తాజాగా సోషల్ మీడియా సాయం వల్ల ఇంటి నుంచి అదృశ్యమైన ఓ యువతి ఆచూకీని గుర్తించారు. ఏప్రిల్ 4న అదృశ్యమైన బెంగళూరుకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్రేయి మజుంద

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (17:13 IST)
సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. తాజాగా సోషల్ మీడియా సాయం వల్ల ఇంటి నుంచి అదృశ్యమైన ఓ యువతి ఆచూకీని గుర్తించారు. ఏప్రిల్ 4న అదృశ్యమైన బెంగళూరుకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్రేయి మజుందర్(35) ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది.

ఆత్రేయిని  బెంగళూరులోని హోటల్ తాజ్ వివంతలో ఆమె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే మజుందర్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు.
 
ఏప్రిల్ 4న టొరంటో నుంచి భారత్‌కు వచ్చిన ఆమె అదే రోజు రాత్రి 9గంటల నుంచి కనిపించకుండాపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఫొటోలను షేర్ చేసి ఎవరికైనా ఆమె కనిపిస్తే తెలియజేయాల్సిందిగా కోరారు. ఆమె ఆచూకీ తెలిస్తే సమాచారమందించాల్సిందిగా అందరినీ కోరారు. 
 
ఇంకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.. ఆత్రేయి తల్లిదండ్రులు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆత్రేయి ఆచూకీని బుధవారం కనుగొన్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు ఆమె బెంగళూరులోని నోవాటెల్ హోటల్‌లో బస చేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత బెంగళూరులోని మారియట్ హోటల్‌కు ఆమె చేరుకుంది. 
 
అక్కడ నుండి వివంతకు వెళ్లింది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను చూసిన అక్కడి హోటల్ సిబ్బంది మజుందర్‌ను గుర్తించారు. పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఆత్రేయి మజుందర్ అదృశ్యం వ్యవహారం సుఖాంతమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments