Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోర్టులోనే జడ్జి కడుపులోకి కత్తి దిగింది.. ఎక్కడ?

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయమూర్తి గదిలో జడ్జి కడుపులోకి కత్తి దిగింది. న్యాయవాదినని చెప్పి జస్టిస్ గదిలోకి ప్రవేశించిన తేజాస్ శర్మ అనే వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితం

కోర్టులోనే జడ్జి కడుపులోకి కత్తి దిగింది.. ఎక్కడ?
, బుధవారం, 7 మార్చి 2018 (17:27 IST)
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయమూర్తి గదిలో జడ్జి కడుపులోకి కత్తి దిగింది. న్యాయవాదినని చెప్పి జస్టిస్ గదిలోకి ప్రవేశించిన తేజాస్ శర్మ అనే వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా లోకాయుక్త జడ్జి విశ్వానథ్ శెట్టి (74)ను పోడిచాడు. ఈ ఘటనతో షాక్ అయిన భద్రతా సిబ్బంది వెంటనే.. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన శర్మను అరెస్ట్ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే జస్టిస్ విశ్వనాథ్ శెట్టి (74) రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి. గత ఏడాది జనవరిలో ఆ రాష్ట్ర లోకాయుక్త జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 7వ తేదీ బుధవారం మధ్యాహ్నం శర్మ అనే వ్యక్తి ఆఫీస్‌కు వచ్చాడు. తనకు తాను లాయర్ అని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. కేసుల విషయమై జడ్జితో మాట్లాడాలని చెప్పాడు. అతని వేషధారణ చూస్తే అలాగే ఉండటంతో గది లోపలికి అనుమతించారు. 
 
అలా వెళ్లిన ఒకటి, రెండు నిమిషాల్లోనే జస్టిస్ శెట్టిపై కత్తితో దాడి చేసి కడుపుతో పోట్లు పొడిచాడు. ప్రస్తుతం ఆయన మాల్యా ఆస్పత్రిలోని ఐసీయులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అందుకోసం ఐజీ స్థాయి అధికారిని నియమించారు. జడ్జికి ఎలాంటి ప్రాణాపాయం లేదని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ ఏం ఇచ్చారు.. ముంత మట్టి.. చెంబుడు నీళ్లు మినహా : చంద్రబాబు