Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటూ కేసులో తనుశ్రీ దత్తాకు షాక్.. నానాకు క్లీన్ చిట్.. ఆధారాల్లేవట..

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (16:26 IST)
దేశాన్ని కుదిపేసిన మీటూ కేసులో త‌నుశ్రీ ద‌త్తాకు మాత్రం ఊహించ‌ని షాక్ త‌గిలింది. మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో నానా ప‌టేక‌ర్‌పై కేసు కూడా న‌మోదైంది.
 
పదేళ్ల క్రితం 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' సెట్స్‌లో త‌న‌ను నానా ప‌టేక‌ర్ లైంగికంగా వేధించాడ‌ని తనుశ్రీ దత్తా ఆరోపించింది. ఈమె త‌ర్వాత చాలా మంది ఇలాంటి కామెంట్స్ చేసారు. అయితే ఇప్పుడు నానా పటేకర్‌ తప్పు చేసాడ‌ని చెప్ప‌డానికి ఎలాంటి సాక్ష్యాలు లేవ‌ని కోర్టు తేల్చేసింది. 
 
దాంతో ఇన్నాళ్లు కోర్టులో నానిన ఈ కేసు నుంచి ఇప్పుడు విముక్తి పొందాడు నానా పటేకర్. కోర్ట్ ఈయ‌న‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్ప‌టికీ తనుశ్రీ ద‌త్తా కావాల‌నుకుంటే ప్రొటెస్ట్‌ రిపోర్ట్‌ను దాఖలు చేయొచ్చ‌ని.. దీనివ‌ల్ల మూసేసిన కేసును కూడా మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రిపించే అవ‌కాశం ఉంటుంద‌ని ఆమె త‌ర‌ఫు లాయ‌ర్ సుజయ్‌ చెప్పారు. 
 
ఈ తీర్పుపై త‌నుశ్రీ ద‌త్తా కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కావాల‌నే నానా ప‌టేక‌ర్‌కు భ‌య‌ప‌డి కొంద‌రు సాక్ష్యం చెప్ప‌డానికి వెన‌కాడుతున్నారంటూ తనుశ్రీ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం