Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటేసి తప్పు చేసారు: బాలయ్య కామెంట్స్

Webdunia
శనివారం, 28 మే 2022 (17:39 IST)
ఒక్క ఛాన్స్ అనగానే ఓటేసారు. తప్పు చేసారు అన్నారు బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు బాలకృష్ణ శనివారం పెమ్మసాని థియేటర్‌లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

 
అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి ప్రజలు తప్పు చేశారన్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటే ఓటు వేసారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఇకనైనా ఆలోచించి ఓటు వేయండి. అప్పుడు ఎక్కడున్నాం... ఇప్పుడు ఎక్కడున్నాం ఆలోచించుకోవాలంటూ వైసిపిపై ఘాటు వ్యాఖ్యలు చేసారు.

 
బాలయ్య వ్యాఖ్యలపై మంత్రి ఆర్.కె రోజా మండిపడ్డారు. 14 ఏళ్ల టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా తన తండ్రి ఎన్టీఆర్‌ కోసం నిమ్మకూరు ముఖం చూడని బాలకృష్ణ ఇప్పుడు ఏదో చేస్తానని అంటున్నారు. నిమ్మకూరులో 30 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, నిమ్మకూరును టూరిస్ట్‌ స్పాట్‌గా అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను సడన్‌గా బాలకృష్ణ చాటుకున్నారు.

 
ఇన్నాళ్లూ గుర్తు రాని ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు వచ్చారో అని ఎద్దేవా చేసారు. ఎన్టీఆర్ కు తగు గుర్తింపు ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అనీ, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత ఆయనది అంటూ చెప్పారు రోజా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments