Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చనిపోయిన మహిళకు కరోనా రెండో డోస్ : ధృవీకరణ పత్రం కూడా జారీ...

చనిపోయిన మహిళకు కరోనా రెండో డోస్ : ధృవీకరణ పత్రం కూడా జారీ...
, బుధవారం, 10 నవంబరు 2021 (10:47 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో చాలా రాష్ట్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. అనేక మందికి వ్యాక్సిన్ వేయకుండానే వ్యాక్సిన్ వేసినట్టుగా ఫోన్ సందేశాలు వస్తున్నాయి. అలాగే, పలు ప్రాంతాల్లో చనిపోయిన వారికి కూడా రెండో డోస్ టీకాలు వేసినట్టు ధృవీకరణ పత్రాలు జారీచేశారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
 
నగరంలోని దమ్మాయిగూడకు చెందిన కె.కౌశల్య అనే 81 యేళ్ల వృద్ధురాలు మే 4వ తేదీన కరోనా తొలి డోస్ టీకా వేయించుకున్నారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యంబారినపడటంతో రెండు నెలల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విషయం తెలియని వైద్య సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు రెండో డోస్ గడువు సమీపిస్తుందని, ఆస్పత్రికి వచ్చి టీకా వేయించుకోవాలని సూసిచంచారు. కానీ, కౌశల్య చనిపోయారని కుటుంబ సభ్యులు హెల్త్ వర్కర్లకు తెలిపారు. ఇంతవరకు బాగానేవుంది.
 
సరిగ్గా పక్షం రోజుల తర్వాత అంటే నవంబరు 8వ తేదీన కౌశల్య రెండో డోస్ టీకా తీసుకున్నట్టుగా మొబైల్ ఫోనుకు సందేశం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా ఎలా వేస్తారంటా ప్రశ్నించారు. ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న టీకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు వైద్య సిబ్బంది కూడా ఇలాంటి పొరపాట్లను ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నట్టుగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5జి స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో 22 శాతం వృద్ధిరేటు