పెట్రోల్ బంకులో తండ్రి-కూతురు దిగిన ఫొటో వైరల్

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (16:56 IST)
అంకితభావంతో కృషి చేస్తే విజయం దానంతట అదే తలుపు తడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ శ్రీకాంత్ మాదవ్ వైద్య. పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురు ఆర్య రాజగోపాలన్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో సీటు సంపాదించిన ఈ యువతిని అభినందించారు. కంపెనీలో ప్రతి ఒక్కరూ ఆమె కృషికి, అంకితభావానికి గర్వపడుతున్నారని తెలిపారు.
 
వివరాల్లోకి వెళ్తే.. ఆర్య రాజగోపాలన్ తండ్రి రెండు దశాబ్దాలుగా కేరళలో పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి బజాజ్ మోటార్స్ లో వర్కర్ గా పనిచేస్తున్నారు. ఎన్నో ఆర్థిక సమస్యల నడుమ తమ కూతురును పెద్ద చదువులు చదివించాలని వారు భావించారు. ఇందుకోసం ఎంతగానో శ్రమించారు. తండ్రిది చిన్న ఉద్యోగమే అయినప్పటికీ ఆర్య చదువుల్లో ఎప్పుడూ ముందుండేది. ఎన్ఐటీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి గ్రాడ్యుయేషన్ తీసుకున్న ఆమె.. ఎంటెక్‌ను ఐఐటీ కాన్పూర్ నుంచి పూర్తి చేయనుంది. అక్కడ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సు చదవనుంది.
 
 
పెట్రోల్ బంకులో తండ్రి-కూతురు దిగిన ఫొటోను కూడా ఐఓసీ చైర్మన్ షేర్ చేశారు. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఆర్య రాజగోపాలన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల ఆ తండ్రి కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆర్య విజయాన్ని కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments