Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని ఉరితీయండి లేదా మమ్మలను కాల్చి చంపండి : రేప్ బాలిక తల్లి

తన 8 యేళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చంపేసిన నిందితులను ఉరితీస్తారా లేదా మమ్మలను కాల్చి చంపండంటూ ఆ బాలిక తల్లి ప్రాధేయపడుతోంది.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (15:11 IST)
తన 8 యేళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చంపేసిన నిందితులను ఉరితీస్తారా లేదా మమ్మలను కాల్చి చంపండంటూ ఆ బాలిక తల్లి ప్రాధేయపడుతోంది. ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా గ్రామంలో కొందరు కామాంధులు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఎంత సంచలనం రేపిందో తెలిసిందే.
 
ఈ ఘటనపై ఆ బాలిక తల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, నిందితులనైనా ఉరి తీయండి.. లేదంటే మమ్మల్ని కాల్చి చంపండి అని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వాళ్లను వదిలేస్తే మమ్మల్ని ఎలాగూ చంపుతారు. నాలుగు గ్రామాల ప్రజలు ఇప్పుడు మా వెంట పడుతున్నారు. మేం కేవలం నలుగురం ఉన్నాం. అన్నీ కోల్పోయాం. మా ఇల్లు, ఆస్తి పోయింది అని ఆమె చెప్పింది.
 
అంతేకాకుండా, సీబీఐ విచారణకు అంగీకరించాలని స్థానిక నేతలు తమపై ఒత్తిడి తెస్తునారని బాలిక తల్లి వెల్లడించింది. అయితే బాలిక కుటుంబం మాత్రం రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. నిందితులను కాపాడటం కోసమే స్థానిక నేతలు సీబీఐ విచారణ కోసం పట్టుబడుతున్నారని బాలిక తల్లి ఆరోపించింది. 
 
మేము ఫిర్యాదు ఇచ్చిన సమయంలోనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే మా బిడ్డ బతికేది. కానీ వాళ్లు ఏడు రోజుల పాటు ఏమీ చేయకుండా ఖాళీగా చేతులు ముడుచుకుని కూర్చున్నారు అని ఆమె విమర్శించింది. 
 
మరోవైపు,  ఈ కేసును కథువా నుంచి మరోచోటికి బదిలీ చేయాలంటూ బాలిక తండ్రి ఇప్పటికే  సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. మరో రెండు రోజుల్లో దీనిపై కోర్టు తీర్పు వెలువరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments