మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా... నాకు పదవితో సంబంధం లేదంటూ...

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (13:43 IST)
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం కావాల్సి వుండగా అంతకంటే ముందుగానే ఆయన తన తన రాజీనామాను ప్రకటించారు. గవర్నర్ లాల్జీ టాండన్‌ను కలవడానికి మధ్యాహ్నం 1 గంటలకు రాజ్ భవన్‌ను సందర్శిస్తానని చెప్పారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... బిజెపి నా సంకల్పాన్ని బలహీనపరచలేదు, నా రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాను అన్నారు. పదవితో సంబంధం లేకుండా మేము ప్రజల కోసం కృషి చేస్తూనే ఉంటాం. నేను రాజీనామా చేయబోతున్నాను, ఈ విషయంలో గవర్నర్‌ను కలుస్తాను అని అన్నారు.
 
మరోవైపు బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాను మద్దతు ఇస్తానని స్వతంత్ర ఎమ్మెల్యే చెప్పారు. స్వతంత్ర ఎమ్మెల్యే ప్రదీప్ జైస్వాల్ మాట్లాడుతూ, "స్వతంత్ర ఎమ్మెల్యే కావడం, ఇప్పుడు నా ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను వారితో మాట్లాడాను. వారు కూడా నా మద్దతు తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు"

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శరీరం చెప్పే ప్రతి మాటనూ అందరూ వినాలి : చిరంజీవి

Regina Cassandra: వీడియోగ్రాఫర్ కు రెజీనా కాసండ్ర క్లాస్ తీసుకుంది

Allu Sirish: దుబాయ్‌లో శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Mahesh Babu: రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదు : మహేష్ బాబు

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments