Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో జోగిని శ్యామల: నా దుస్తులు విప్పి వీడియోలు తీసిందంటూ...

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (11:54 IST)
తెలంగాణాలో బోనాల పండగ సమయంలో ఆటపాటలతో ఆకట్టుకునే జోగిని శ్యామల వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పైన లైంగికంగా మానసికంగా దాడికి పాల్పడిందని ఒక మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో జోగిని శ్యామలపై జీరో సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 
దైవ దర్శనానికి వెళ్లిన తనపై శ్యామల దాడి చేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిందని ఆ మహిళ ఆరోపించింది. అంతేకాదు శ్యామలతో పాటు మరో 15 మందిపైన సదరు మహిళ ఫిర్యాదు చేసింది. తన దుస్తులు విప్పి.. శ్యామల వీడియోలు తీశారని బాధితురాలు ఆరోపించింది. సికింద్రాబాద్ లోని గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న స్రవంతి తన తల్లి సంధ్య ఈ నెల 12న మెదక్ జిల్లా పాపన్నపేట వన దుర్గాభవానీ దేవాలయ దర్శించుకునేందుకు వెళ్లారు.
 
దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న వారిని జోగిని శ్యామల కలిశారు. శ్యామల తాము ఉంటున్న ప్రదేశానికి రావాలంటూ స్రవంతి తన తల్లి సంధ్యను కోరింది. దాంతో వారు జోగిని నివాసానికి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ 15 మంది పురుషులు మరో మహిళ ఉండటంతో స్రవంతి ఇంట్లోకి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. అయినా జోగిని శ్యామల వినిపించుకోకుండా లోపలి రావాలంటూ అభ్యర్థించడంతో  స్రవంతి తన తల్లి లోనికి వెళ్లారు.
 
ఆ తర్వాత శ్యామల వారిపై దాడికి పాల్పడింది. బట్టలు విప్పి ఫోటోలు వీడియోలు తీసేందుకు ప్రయత్నించింది. తనపై దాడి చేయడమే కాకుండా వివస్త్రను చేసి ఫొటోలు వీడియోలు తీశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కేసును పాపన్నపేట పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం