Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నదీజలాల వివాదంపై అఖిలపక్షం: సిపిఎం డిమాండ్‌

నదీజలాల వివాదంపై అఖిలపక్షం: సిపిఎం డిమాండ్‌
, గురువారం, 14 మే 2020 (21:30 IST)
కృష్ణానది నదీజలాల విషయంలో వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు మధు ఒక ప్రకటన విడుదల చేశారు. నదీజలాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.

నదీజలాలపై మన రాష్ట్రానికున్న హక్కులు ఏంటి, ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి అనే వివరాలను ముఖ్యమంత్రి సమావేశానికి వివరిస్తే, ఉమ్మడిగా ఒక అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకునేందుకు వీలుంటుందని తెలిపారు. సిఎం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాడేపల్లిలో మద్యం సీసాలు స్వాధీనం