Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల తర్వాత జగన్ ఆ మాట అన్నారంటే ఆయన ఎంత భ్రమలో వున్నారు: వైసిపి మాజీ ఎమ్మెల్యే

ఐవీఆర్
బుధవారం, 5 జూన్ 2024 (17:40 IST)
కర్టెసి-ట్విట్టర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీ పరాజయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ... ఒక కులం అని కాదు... అన్ని కులాలు కలిసి వైసిపిని ఘోరంగా ఓడించాయని అన్నారు. ఈ ఓటమికి ఎన్నో కారణాలున్నాయని చెప్పుకొచ్చారు.
 
నియోజకవర్గంలో పనుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళితే... జగన్ గారు తాము ఇచ్చిన కాగితాన్ని సంబంధిత అధికారి చేతిలో పెట్టేవారు. ఆ కాగితంపై సంతకం చేయించుకోవడానికి మేము ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ పడిగాపులు కాయాల్సి వచ్చేది.

అలాంది దౌర్భాగ్యపు అధికారికి ఆ కాగితంపై సంతకం చేస్తే మా నియోజకవర్గంలో 10 వేల మంది ప్రజలకు మేలు కలుగుతుందని తెలియదు. ఏం చేయాలి.. ఇలా ఎన్నో సార్లు జరిగింది. ఇలాంటి కారణాలు ఎన్నో ఓటమికి బాటలు వేసాయి. జగన్ చుట్టూ చేరిన అధికారులు, కోటరీ అంతా కలిసి ఆయన్ను భ్రమలో పెట్టేసారు.
 
ఎన్నికలు ముగిసిన తర్వాత ఐపాక్ ఆఫీసుకి వెళ్లి ప్రపంచం అంతా మనవైపుకి చూడబోతుంది, వైనాట్ 175 అని అన్నారంటే ఆయన్ని ఎంత భ్రమలో పెట్టారో అర్థం చేసుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments