Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల తర్వాత జగన్ ఆ మాట అన్నారంటే ఆయన ఎంత భ్రమలో వున్నారు: వైసిపి మాజీ ఎమ్మెల్యే

ఐవీఆర్
బుధవారం, 5 జూన్ 2024 (17:40 IST)
కర్టెసి-ట్విట్టర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీ పరాజయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ... ఒక కులం అని కాదు... అన్ని కులాలు కలిసి వైసిపిని ఘోరంగా ఓడించాయని అన్నారు. ఈ ఓటమికి ఎన్నో కారణాలున్నాయని చెప్పుకొచ్చారు.
 
నియోజకవర్గంలో పనుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళితే... జగన్ గారు తాము ఇచ్చిన కాగితాన్ని సంబంధిత అధికారి చేతిలో పెట్టేవారు. ఆ కాగితంపై సంతకం చేయించుకోవడానికి మేము ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ పడిగాపులు కాయాల్సి వచ్చేది.

అలాంది దౌర్భాగ్యపు అధికారికి ఆ కాగితంపై సంతకం చేస్తే మా నియోజకవర్గంలో 10 వేల మంది ప్రజలకు మేలు కలుగుతుందని తెలియదు. ఏం చేయాలి.. ఇలా ఎన్నో సార్లు జరిగింది. ఇలాంటి కారణాలు ఎన్నో ఓటమికి బాటలు వేసాయి. జగన్ చుట్టూ చేరిన అధికారులు, కోటరీ అంతా కలిసి ఆయన్ను భ్రమలో పెట్టేసారు.
 
ఎన్నికలు ముగిసిన తర్వాత ఐపాక్ ఆఫీసుకి వెళ్లి ప్రపంచం అంతా మనవైపుకి చూడబోతుంది, వైనాట్ 175 అని అన్నారంటే ఆయన్ని ఎంత భ్రమలో పెట్టారో అర్థం చేసుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments