Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో పదవుల పందేరం : కాంగ్రెస్‌కు హోం.. జేడీఎస్‌కు ఆర్థికం

కర్ణాటక రాష్ట్రంలో మంత్రిత్వశాఖల కేటాయింపు ముగిసింది. ఫలితంగా త్వరలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈనెల 24వ తేదీన కన్నడనాట జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కొలువుదీరింది.

Webdunia
గురువారం, 31 మే 2018 (18:33 IST)
కర్ణాటక రాష్ట్రంలో మంత్రిత్వశాఖల కేటాయింపు ముగిసింది. ఫలితంగా త్వరలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఈనెల 24వ తేదీన కన్నడనాట జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. కూటమి తరపున ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజున ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు.
 
అయితే మంత్రి పదవుల కేటాయింపుల్లో చిక్కుముడులు ఏర్పడటంతో ఒక్క మంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతల మధ్య మంత్రిత్వ శాఖల కేటాయింపుపై కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలీకృతమయ్యాయి. 
 
దీంతో ఆర్థిక శాఖను జేడీఎస్‌, హోం శాఖను కాంగ్రెస్ పంచుకున్నట్లు సమాచారం. ఈ రెండూ కీలక శాఖలు కావడంతో వీటిపై ఇన్నాళ్లూ కొనసాగిన తర్జనభర్జనకు ఫుల్‌స్టాప్ పడినట్టయింది. మిగిలిన శాఖల విషయంలో ఇరు పార్టీలు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కాగా, ముందుగా అనుకున్నట్టుగానే... కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments