Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేశ్ నిమజ్జనం.. అప్పుడు 2 రోజులు.. ప్రస్తుతం ఒకరోజే..

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (10:05 IST)
వినాయకుడి నిమజ్జనాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇదివరకు వినాయక నిమజ్జనం అంటే రెండు రోజుల పాటు జరిగేవి. కానీ ఎప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడిని ఉదయమే నిమజ్జనానికి తరలించారో.. అప్పటి నుంచీ దాదాపు ఒకే రోజున వినాయక నిమజ్జనం పూర్తవుతోంది. ఈసారి కూడా అదే విధంగా ప్లాన్ చెయ్యడం వల్ల నిమజ్జనం అర్థరాత్రి కల్లా పూర్తవుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 
 
అంతేగాకుండా.. ఏ విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేయాలో విగ్రహాన్ని ప్రతిష్టించిన రోజే ఖరారు చేయడం వల్ల నిమజ్జనం సాఫీగా సాగిపోయే అవకాశం వుంది. ఇంకా 20వేల మంది పోలీసుల భద్రత, 23 చెరువుల్ని నిమజ్జనానికి రెడీ చేయడం ద్వారా.. నిమజ్జన ప్రక్రియ వేగంగా జరిగే అవకాశాలున్నాయి. ఇందుకోసం 32 ప్రాంతాల్లో 93 క్రేన్లు, 134 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. 
 
బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ నుంచీ హుస్సేన్‌సాగర్ వరకూ శోభాయాత్ర జరుగనుండటంతో  ట్రాఫిక్ ఆంక్షలు అమలు అయ్యాయి. శోభాయాత్రలో విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం..  అంబులెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఇకపోతే.. ఈ ఏడాది హైదరాబాద్‌లో 60 వేల విగ్రహాల్ని భక్తులు ప్రతిష్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments