Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదల పెన్నిది, మనసున్న మహరాజు సోనూసూద్, అదంతా ఆయన నిర్ణయమేనంటున్న రియల్ హీరో

Webdunia
గురువారం, 30 జులై 2020 (17:37 IST)
సోనూసూద్ రీల్ లైఫ్‌లో విలన్ గానీ, లాక్ డౌన్ సందర్భంలో మాత్రం నిజమైన హీరోగా మారారు. వేల మంది వలస కార్మికులకు స్వస్థలాలకు పంపించి నిజ జీవితంలో సుప్రీంహీరోగా మారారు. వలస కూలీల కష్టాలకు చలించిపోయి సొంత డబ్బుతో వారిని ఇళ్లకు చేర్చి ప్రశంసలు పొందారు.
 
అది అక్కడితో ఆగలేదు. లాక్‌డౌన్ వల్ల విదేశాలలో చిక్కుకున్న దాదాపు 1500 మంది విద్యార్థులను ఇండియాకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు స్పందించే లోపే బస్సులు ఏర్పాటు చేసి వారిని తమ సొంత ఊర్లకు పంపించారు.
 
ప్రతి వలస కార్మికుడు తమ ఇంటికి చేర్చేంత వరకు ఆగలేదు. ఈ రియల్ హీరో సోనూసూద్ ఈ రోజు 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మరో మంచి కార్యాన్ని తలపెట్టాడు. దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 50వేల మందికి ఉచిత వైద్యం అందిస్తానని తెలిపారు. అంతేకాదు, చిత్తూరు జిల్లా రైతుకు ట్రాక్టర్ ఇవ్వడంపై చెబుతూ.. అదంతా పైవాడి దయ అనీ, దేవుడు నిర్ణయం మేరకే ఏదైనా జరుగుతుందన్నారు. తన తాహతుకొద్దీ సాయం చేశాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments