అగ్ర వ‌ర్ణాల‌కు శుభవార్త, 10 శాతం రిజర్వేష‌న్

Webdunia
గురువారం, 15 జులై 2021 (20:15 IST)
వివిధ వ‌ర్గాల‌కు తాయిలాలు అందిస్తున్న వైసిపి అధినేత జ‌గ‌న్ ... అగ్ర‌వ‌ర్ణాల‌కూ గాలం వేశారు. త‌న‌దైన శైలిలో జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేసింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్‌.జగన్‌ సర్కార్ ఎక్కువ మంది అగ్రవర్ణ పేదలకు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కుటుంబ వార్షికాదాయం 8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయ పరిమితిని ప్ర‌భుత్వం రూ.6 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచింది. గ‌తంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ మెమో జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని తహశీల్దార్‌ కార్యాలయాలకు అధికారిక సమాచారం అందింది. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్దేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments