నిజమైన విలన్ చంద్రబాబే.. ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టింది.. వాళ్లే?: నాదెండ్ల

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (15:55 IST)
''మహానాయకుడు'' సినిమాపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు సంచలన కామెంట్స్ చేశారు. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానాయకుడులో తనను విలన్‌గా చూపెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. 
 
ఎన్టీఆర్ వారసులు తీసిన సినిమా విషయంలో అంతకంటే ఎక్కువ ఆశించలేమని.. వాపోయారు. అసలు విలన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అని.. నిజాలు చెప్పేంత ధైర్యం వారికి లేదంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొమ్మని చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ మృతికి కారకులు ఆయన కుటుంబ సభ్యులేనని ఎన్టీఆర్‌ను తీవ్రంగా క్షోభ పెట్టింది వారేనని తెలిపారు. 
 
ఎన్టీఆర్ తిండి కోసమని కొంత సొమ్మును తన వద్ద వుంచుకుంటే.. ఆ విషయంలోనూ కోర్టుకు వెళ్లిన వారు.. ఎన్టీఆర్ వారసులని.. నాదెండ్ల చెప్పారు. ఎన్టీఆర్‌ ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేసి ఆయన్ని హింసించారని అన్నారు. 
 
ఆ సమయంలో ఎన్టీఆర్‌కు లక్ష్మీ పార్వతి సపర్యలు చేసిందని.. ఆయన గెలిచాకా.. మళ్లీ ఆయన చుట్టూ చేరిన ఘనత ఎన్టీఆర్ వారసులదని నాదెండ్ల భాస్కరరావు వెల్లడించారు. సినిమాలతో నిజాలను మార్చలేరన్నారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

Sundeep Kishan: సూపర్ సుబ్బు సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ ... సందీప్ కిషన్

Mamita Baiju: అందుకే డ్యూడ్‌.. నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా వుంది : మమిత బైజు

K-Ramp: దీపావళికి అన్ని హిట్ కావాలి. K-ర్యాంప్ పెద్ద హిట్ కావాలి : డైరెక్టర్ జైన్స్ నాని

Siddu jonnalgadda: యూత్ సినిమాలంటే.. ఎలా వుండాలో.. తెలుసు కదా. చెబుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments