Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఏడాదిలో 70లక్షల మందికి బిర్యానీ వడ్డించింది.. ఇంకా?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (15:36 IST)
ప్యారడైజ్ బిర్యానీకి అరుదైన గౌరవం దక్కింది. ఒక్క ఏడాదిలోనే ప్యారడైజ్ హోటల్ దాదాపు 70లక్షల మంది వినియోగదారులకు బిర్యానీ వడ్డించింది. ఇంత భారీ స్థాయిలో బిర్యానీ విక్రయించినందుకు గాను ప్యారడైజ్‌‌ ఛైర్మన్‌ అలీ హేమతికి ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ సంస్థ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా ప్రకటించింది. 
 
దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ ప్యారడైజ్ బిర్యానీ ప్రస్తుతం లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం ద్వారా ఆ సంస్థ అధికారులు పండగ చేసుకున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌‌ హోటల్లో గురువారం కేక్‌ కట్‌ చేసి సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. 
 
2017 జనవరి 1 నుంచి అదే ఏడాది డిసెంబర్ 31 వరకు 70,44,289 బిర్యానీలను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. బెస్ట్ బిర్యానీ అవార్డును సైతం ప్యారడైజ్ బిర్యానీ కైవసం చేసుకుంది. ప్యారడైజ్ బిర్యానీ సంస్థల చైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించి గౌరవించింది
 
ఈ సందర్భంగా ఛైర్మన్ అలీ మాట్లాడుతూ.. లిమ్కా బుక్ అవార్డుతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37 ప్యారడైజ్‌ బ్రాంచ్‌లు ఉన్నాయని, త్వరలోనే విదేశాల్లోనూ ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments