Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకి అరుదైన గౌరవం.. అదేంటంటే?

Advertiesment
Mahesh babu
సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి మరో అరుదైన అవకాశం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆయన మైనపు విగ్రహాన్ని రూపొందించింది. ఈ మైనపు విగ్రహాన్ని మార్చి 25న మహేశ్ స్వయంగా హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్ వేదికగా ఆవిష్కరించనున్నాడు. ఆ తర్వాత విగ్రహాన్ని సింగపూర్‌కి తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. 
 
టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు ఒక విగ్రహాన్ని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మహేశ్‌కి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా పూజా హెగ్దే ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. భరత్ అనే నేను చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడంతో మహర్షి సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఈ చిత్రం ఏప్రిల్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మసాజ్ ముసుగులో వ్యభిచారం... అందమైన అమ్మాయిలతో క్రాస్ మసాజ్