Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు : సీఎంగా హేమంత్ సొరేన్... తేజస్వి యాదవ్

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (13:25 IST)
జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు : జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి విజయభేరీ మోగించింది. మొత్తం 81 అసెంబ్లీ సీట్లకుగాను ప్రభుత్వ ఏర్పాటుకు 42 సీట్లు కావాల్సివుంది. అయితే, యూపీఏ కూటమి 43 సీట్లలో ఆధిక్యంల కొనసాగుతుంది. 
 
అలాగే, బీజేపీ 28, ఏజేఎస్ యూ 4, జేవీఎం 3, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ 42, జేఎంఎం 19, జేవీఎం 8, కాంగ్రెస్ 6, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ఫలితంగా బీజేపీ అధికారాన్ని కోల్పోగా, కాంగ్రెస్ కూటమి అధికారంలోకిరానుంది. 
 
ఈ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో మహాఘట బంధన్ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుందని చెప్పారు. జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపడుతారన్నారు. హేమంత్ సోరేన్ నాయకత్వంలో ఈ ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. దుమ్కా నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments