Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు వస్తే ఏం లాభం... నాలుగు జిరాక్స్ షాపులు మినహా...

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (13:14 IST)
రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీకి మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డి తీవ్రంగా విభేదించారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అంటూ నిలదీశారు. 
 
హైకోర్టును కర్నూలుకు తరలిస్తే ఏం వస్తుందనీ, నాలుగు జిరాక్స్ షాపులు మినహా అని ఆమె వ్యాఖ్యానించారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది నీళ్లు, పరిశ్రమలని ఆమె అన్నారు. హైకోర్టును మంజూరు చేసి, సీమను ఉద్దరించామని చెప్పవద్దని కోరిన ఆమె, జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలను కొనసాగించాలని సూచించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలో కొనసాగించాలని సలహా ఇచ్చారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలతో జగన్ సర్కారు ఆటలాడుతోందని అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments