Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణానిధి ఆరోగ్యంపై తాజా బులెటిన్‌.. ఇప్పటికి ఓకే...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి ఆదివారం ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు నిరంతరం వైద్య సహాయం అందిస్తున్నా

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (10:26 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి ఆదివారం ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు నిరంతరం వైద్య సహాయం అందిస్తున్నామని పేర్కొంది. ఐసీయూలో ఆయనకు వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోందని తెలిపింది.
 
కాగా, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్‌, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కరుణానిధి ఆరోగ్యం శుక్రవారం అర్థరాత్రి దాటాక విషమించడంతో, స్థానిక ఆళ్వారుపేటలోని కావేరి ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. పూర్తిగా పల్స్‌ పడిపోయిన స్థితిలో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు అందించిన చికిత్సతో కరుణ కొంత కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 
 
కరుణ ఆరోగ్యంపై ఆందోళన చెందిన వేలాదిమంది కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు, ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారిని కలవడానికి బయటకు వచ్చినప్పుడు స్టాలిన్‌ అదుపు చేసుకోలేక ఒక్కపెట్టున రోదించారు. ఇకపోతే, ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. 
 
ఆస్పత్రి వద్ద 2 వేల మందితో భద్ర త ఏర్పాటు చేశారు. కరుణ ఆరోగ్యం నిలకడగా ఉందని కావేరి ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరవిందన్‌ సెల్వన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కరుణ ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో శివషణ్ముగం(64), తమీ మ్‌(55) అనే ఇద్దరు గుండెపోటుతో మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments