Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు.. కలెక్టర్‌కు నోట్ రాసిన దొంగ

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (15:29 IST)
Thief
ఓ దొంగ ప్రభుత్వ అధికారి నోట్ ప్యాడ్‌ను పెన్నును ఉపయోగించాడు. ఎందుకో తెలుసుకోవాలంటే... ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని ఒక ప్రభుత్వ అధికారి నివాసంలోకి దొంగ చొరబడ్డాడు. 
 
అక్కడ తగినంత నగదు, విలువైన వస్తువులను కనుగొనలేకపోయినందుకు నిరాశకు గురైన ఒక దొంగ, “డబ్బు లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు” అని అడిగిన నోట్‌ను అక్కడే వదిలేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 
 
దొంగ రాసిన నోట్ కాపీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం జిల్లాలోని ఖటేగావ్ పట్టణంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎమ్) గా నియమించబడిన త్రిలోచన్ సింగ్ గౌర్ నివాసంలో రూ.30,000 నగదు, కొన్ని ఆభరణాలు దొంగిలించబడ్డాయని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమ్రావ్ సింగ్ తెలిపారు.
 
పదిహేను రోజుల విరామం తర్వాత శనివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దొంగతనం గురించి కలెక్టర్‌కు తెలిసింది. ఇంకా దొంగ రాసిన నోట్ దొరికింది. దొంగ నోట్ రాయడానికి ప్రభుత్వ అధికారి నోట్‌ప్యాడ్, పెన్ను ఉపయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments