Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో ఐదుగురు జవాన్ల వీరమరణం

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (14:32 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మళ్లీ ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. తాజాగా ఉగ్రమూకల దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఈ దారుణం జరిగింది. 
 
ఇక్కడ ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న జవాన్లు ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో పాల్గొన్నారు. అపుడు ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు భార‌త జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు. 
 
మృతి చెందిన జ‌వాన్ల‌లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి కూడా ఉన్నారు. ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌ర‌ప‌డంతో భార‌త జ‌వాన్లు ధీటుగా స్పందిస్తున్నారు. ప్ర‌స్తుతం కాల్పులు కొన‌సాగుతున్నాయి. ఉగ్ర‌వాదుల‌ను జ‌వాన్లు మ‌ట్టుబెట్టే అవ‌కాశం ఉంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments