సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం, దేవా నాతో ఆడుకోకు అంటూ శ్రావణి ఆడియో

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:05 IST)
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయట పడింది. సాయి అనే వ్యక్తి శ్రావణిని నా ముందే చంపాలని చూశాడని, తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చాడు అని దేవరాజు వీడియో ఒకటి విడుదల చేశాడు. సాయిని పెళ్లి చేసుకోక పోతే చంపేస్తాడని భయంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుంది అని దేవరాజ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
 
శ్రావణి కాల్ రికార్డ్ మొత్తం పోలీసులు ముందు పెడుతానని, తల్లిదండ్రులు ఒత్తిడితోనే గతంతో శ్రావణి తనపై కేసు పెట్టిందన్నాడు దేవరాజు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకోమని శ్రావణి తనను అడిగిందని, తను ఒప్పుకోకపోయేసరిగా నాపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు దేవరాజు.
రెండు రోజులు క్రితం శ్రావణి తోకలిసి తను శ్రీకన్య రెస్టారెంట్‌కి వెళ్లడం జరిగిందని, హోటల్ సమీపంలో శ్రావణిని కత్తితో పొడిచేందుకు సాయి ప్రయత్నం చేశాడన్నాడు దేవరాజ్. శ్రావణికి సాయి అనే వ్యక్తి 5 సంవత్సరాల నుండి పరిచయం ఉందని, సంవత్సరం క్రితం నేను శ్రావణికి పరిచయం అయ్యానని చెప్పాడు. శ్రావణి కుటుంబ సభ్యులు మరియు సాయి అనే వ్యక్తి ఆమెను కొట్టి హింసించేవారని నాతో చెప్పిందని దేవరాజ్ చెబుతున్నాడు.
అయితే శ్రావణిని, దేవరాజ్ బెదిరించిన ఆడియో ఇప్పుడు కీలకంగా మారింది. మర్యాదగా వచ్చి తనతో గంట టైం గడపాలని, రాకపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవు అంటూ ఆ ఫోన్ కాల్‌లో దేవరాజ్ బెదిరింపులకు దిగాడు. శ్రావణి మాత్రం ఇంతటితో ఆపేయ్ దేవ, నీకు విశ్వాసం లేదు దేవ, నాతో ఆడుకోకు దేవ, నీతో మాట్లాడను సారీ దేవా అంటూ శ్రావణి ఫోన్ పెట్టేసింది. ఈ ఆడియో ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారునుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments