Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని కాపాడలేని వారు దేశాన్ని ఎలా?: నితిన్ గడ్కరీ

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:36 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది కార్యకర్తలు ముందుగా తమ ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను చూసుకోలేనివాళ్లు.. దేశాన్ని ఏం కాపాడుతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.


ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే.. నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఓటమిని అంగీకరించాలన్నారు. తాజాగా నాగపూ‌లో ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. తన జీవితాన్ని దేశానికి అంకితం చేద్దామనుకుంటున్నానని చాలామంది కార్యకర్తలు చెప్తున్నారు. అలా ఓ వ్యక్తితో మాట్లాడినప్పుడు అతడి వివరాలను ఆరా తీశాను. అతనో దుకాణాన్ని నడపలేక దాన్ని మూసేసినట్లు విన్నాను. అంతేగాకుండా అతనికి భార్యాపిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేదని అతని మాటలను బట్టి తెలుసుకున్నాను. 
 
అందుకే ముందు ఇంటి గురించి పట్టించుకోమని చెప్పానని నితిన్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇంటిని సరిగ్గా నడపలేని వ్యక్తి దేశాన్నెలా బాగు చేస్తాడని ప్రశ్నించాడు. అందుకు ముందు కుటుంబం, పిల్లల గురించి ఆలోచించండి.. తర్వాత పార్టీ గురించి ఆలోచిద్దామని ఆ కార్యకర్తకు చెప్పినట్లు నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments