Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం కోసం అరటి గెలలు కోయబోతే విద్యుత్ షాక్... నలుగురు దుర్మరణం..

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:31 IST)
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. నిశ్చితార్థం వేడుక కోసం ఆరటి గెలలు తేవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మండలంలోని పాతరౌతుపేటకు చెందిన కొమ్మ వెంకన్న (49) తన కుమారుడు శ్రీనుకు ఈ నెల 6వ తేదీన నిశ్చితార్థం చేయాలని నిర్ణయించాడు. 
 
ఇందుకోసం అరటి గెలలు తేవడానికి ఆదివారం ఉదయం కొత్తరౌతుపేటలో ఉంటున్న తన బావమరిది ఆబోతుల రాములు (57)కు చెందిన అరటితోటకు బావ, బావమరిదిలు ఇద్దరూ కలిసి వెళ్లారు. అక్కడ చెట్లకు హెచ్‌టీ విద్యుత్‌ తీగలు తగులుతున్నాయని గమనించని వెంకన్న, రాములు గెలలను కోయబోయారు. 
 
విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. ఉదయం వెళ్లిన మనుషులు ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన రాములు భార్య పుణ్యవతి (53), వెంకన్నకు సోదరి వరుస అయ్యే రౌతు బంగారమ్మ (52) తోటకు వెళ్లారు. విగత జీవులుగా పడి ఉన్నవారిని పట్టుకోవడంతో వారికి కూడా విద్యుత్ షాక్ తగిలి మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments