Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం కోసం అరటి గెలలు కోయబోతే విద్యుత్ షాక్... నలుగురు దుర్మరణం..

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:31 IST)
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. నిశ్చితార్థం వేడుక కోసం ఆరటి గెలలు తేవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మండలంలోని పాతరౌతుపేటకు చెందిన కొమ్మ వెంకన్న (49) తన కుమారుడు శ్రీనుకు ఈ నెల 6వ తేదీన నిశ్చితార్థం చేయాలని నిర్ణయించాడు. 
 
ఇందుకోసం అరటి గెలలు తేవడానికి ఆదివారం ఉదయం కొత్తరౌతుపేటలో ఉంటున్న తన బావమరిది ఆబోతుల రాములు (57)కు చెందిన అరటితోటకు బావ, బావమరిదిలు ఇద్దరూ కలిసి వెళ్లారు. అక్కడ చెట్లకు హెచ్‌టీ విద్యుత్‌ తీగలు తగులుతున్నాయని గమనించని వెంకన్న, రాములు గెలలను కోయబోయారు. 
 
విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. ఉదయం వెళ్లిన మనుషులు ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన రాములు భార్య పుణ్యవతి (53), వెంకన్నకు సోదరి వరుస అయ్యే రౌతు బంగారమ్మ (52) తోటకు వెళ్లారు. విగత జీవులుగా పడి ఉన్నవారిని పట్టుకోవడంతో వారికి కూడా విద్యుత్ షాక్ తగిలి మరణించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments