Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పబ్జీ గేమ్‌పై స్పందించిన మోడీజీ... ఏమన్నారంటే?

పబ్జీ గేమ్‌పై స్పందించిన మోడీజీ... ఏమన్నారంటే?
, బుధవారం, 30 జనవరి 2019 (13:18 IST)
ఢిల్లీలో మోడీజీ 24 రాష్ట్రాల విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తోంది. ప్రతిఒక్కరి చేతిలో రెండు మూడు స్మార్ట్‌ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ఇక అందులో ఆడే గేమ్‌ల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. గంటల తరబడి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వాటిలోనే మునిగి తేలుతున్నారు. 
 
బ్లూవేల్ గేమ్ గురించి మరవకముందే పబ్జి గేమ్ ప్రభంజనం మొదలైంది. పిల్లలైతే అదే పనిగా దీనిని ఆడుతున్నారు. దీనిపై ఆందోళన చెందిన ఒక తల్లి ఈ కార్యక్రమంలో మోడీని సలహా కోరగా ఆయనిచ్చిన సమాధానం మొదట సరదాగా, తర్వాత ఆలోచింపజేసే విధంగా ఉంది.
 
మా అబ్బాయి ఇంతకుముందు బాగా చదివి, అందరి ప్రశంసలు అందుకునేవాడు. ఇప్పుడు గంటల తరబడి పబ్జి గేమ్ ఆడుతున్నాడు, ఎంతచెప్పినా వినడం లేదు, ఎలా దూరంగా ఉంచాలో సలహా ఇవ్వమని ఒక తల్లి కోరగా... స్పందించిన మోడీ సరదాగా ''ఏ పబ్జి వాలా హై క్యా'' అని మొదలుపెట్టి గేమ్స్‌కు మీ పిల్లలు అడిక్ట్ అవుతున్నారని ఏకంగా టెక్నాలజీనే వారికి దూరం చేయడం మంచిది కాదన్నారు.
 
నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు ప్రతిదాంట్లో ప్లస్, మైనస్ ఉంటాయన్నారు. కనుక మీ పిల్లలకు ఏది అవసరమో తల్లిదండ్రులైన మీరే నిర్ణయం తీసుకోవాలి. టెక్నాలజీని వారు నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఉపయోగించేలా మీరే జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమంగా ఫోన్‌లో గేమ్స్ ఆడే పరిస్థితి నుండి గ్రౌండ్‌కు వెళ్లి ఆడుకునే స్థితికి తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రులదేనని హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ ఎజెండా వల్ల భారత్‌లో మతహింస : అమెరికా వార్నింగ్