Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే ఇక మరణదండనే : ఆర్డినెన్స్‌కు ఆమోదం

బాలికలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఇకపై మరణశిక్షలను అమలు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఆర్డినెన్స్‌లోని నిబంధన మేరకు 12 సంవత్సరాల వయసులోపు బాలలపై అత్యాచారాలకు పాల్

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:37 IST)
బాలికలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఇకపై మరణశిక్షలను అమలు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఆర్డినెన్స్‌లోని నిబంధన మేరకు 12 సంవత్సరాల వయసులోపు బాలలపై అత్యాచారాలకు పాల్పడే నేరస్థులకు మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు లైంగిక నేరాల నుంచి బాలలపరిరక్షణ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
శనివారం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, స్మృతి ఇరానీ, ఉమా భారతి, పీయూష్ గోయల్, హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. 
 
ఈసమావేశంలో పోక్సో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 0-12 ఏళ్ల వయసు చిన్నారులపై అత్యాచారం జరిపేవారికి మరణ దండన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపుతారు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ఆర్డినెన్స్ జారీఅవుతుంది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం