రైలు పట్టాలపై సిలిండర్ పెట్టాడు.. అంతే ఎగిరిపడింది కానీ.. పేలలేదు..

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (12:03 IST)
సోషల్ మీడియాపై యువతకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేయడం కోసం వ్యూస్ కొట్టడం కోసం ఏకంగా ఓ సిలిండర్‌ను మీద పెట్టాడు ఓ ఆకతాయి. దానిపై రైలు వెళ్తే ఎలా వుంటుందో షూట్ చేయాలనుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వేర్పాడుకు చెందిన రామిరెడ్డి అనే యువకుడు గతంలో రైలు పట్టాలపై బాణసంచి, బైకులను పెట్టి రైలు వాటిపై నుండి వెళ్లేప్పుడు ఎలా ఉంటుందో షూట్ చేసి యూట్యూబ్‌లో ఉంచేవాడు. కానీ ఈసారి సిలిండర్‌ను రైలు పట్టాలపై వుంచాడు. దానిపై రైలు వెళ్తే ఎలా ఉంటుందో షూట్ చేయాలనుకున్నాడు.
 
అయితే అదృష్టం బావుండి ఈ ఘటనలో పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. రైలు సిలిండర్ ను ఢీకొట్టడంతో వేగంగా దూరంగా ఎగిరిపడింది కానీ పేలలేదు. హైదరాబాద్‌కు చెందిన నరసింహ అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలను చూసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రామిరెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments