Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లి వరసయ్యే యువతికి తాళి కట్టిన అక్క... ఎక్కడ?

Webdunia
గురువారం, 4 జులై 2019 (17:30 IST)
సాధారణంగా స్త్రీపురుషులు వివాహం చేసుకుంటారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సాక్షాత్తూ దేశ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన కారణంగా చాలామంది స్వలింగ సంపర్కులు తమ బంధాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వారిలో కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకుంటున్నారు. 
 
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఇలాంటి ఘటనే ఇందుకు నిదర్శనం. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు అమ్మాయిలు బుధవారం నాడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇలాంటి వివాహం పవిత్ర పుణ్యస్థలం అయిన వారణాసిలో జరగడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రధాని మోదీ ఎంపీగా గెలుపొందిన నియోజకవర్గం కావడం విశేషం.
 
కాన్పూర్‌కు చెందిన ఓ యువతి తనకు చెల్లి వరుసయ్యే మరో యువతిని స్థానికంగా ఉండే శివాలయానికి తీసుకువెళ్లింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఎరుపు రంగు చున్నీని ముఖానికి ధరించి వెళ్లారు. తాము ఒకరినొకరు ప్రేమించుకున్నామని, తమకు పెళ్లి చేయవలసిందిగా పూజారిని కోరగా, ఆయన అందుకు నిరాకరించారు. అయితే కొంతసేపటికి వారు తమకు తాముగా వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై ప్రస్తుతం వారణాసిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments