Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లి చేస్కుంది... 15 రోజులకే ఈ మొగుడు నాకొద్దంటూ పారిపోయింది...

Webdunia
గురువారం, 4 జులై 2019 (16:18 IST)
ప్రేమ పెళ్లిళ్లు కొన్నిసార్లు రెండు ముక్కలవుతుంటాయి. మరికొన్ని బంధాలు ఎంతో దృఢంగా వుంటాయి. ఐతే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుని చిన్నచిన్న మనస్పర్థలతో కట్టుకున్న భర్తను వదిలేస్తారు. మరికొందరి విషయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తననే నమ్మి వచ్చిందన్న విషయాన్ని పక్కనపెట్టేసి ఆమెని హింసిస్తుంటారు. తెలంగాణలోని మేడ్చల్‌లో జరిగిన ప్రేమ పెళ్లి పెటాకులైంది. 
 
వివరాల్లోకి వెళితే... మేడ్చల్ చంద్రానగర్‌కు చెందిన వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకి కూడా ఇతడంటే ఇష్టం వుండటంతో గత మే నెల 15న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగానే వున్నారు. ఆ తర్వాత జూన్ 26న సదరు యువతి తన బంధువుల ఇంటికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె తిరిగి జూలై 1న వచ్చింది. ఇక అప్పట్నుంచి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.
 
భర్తను దూరంగా పెడుతుండటంతో అనుమానం వచ్చిన అతడు... ఆమెని నిలదీశాడు. దాంతో నువ్వు నాకు వద్దంటూ అతడికి చెప్పేసింది. అతడు ఎలాగో సర్దుకుందాం అనుకునేలోపుగా మంగళవారం నాడు తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇక ఫోన్ చేస్తుంటే స్విచాఫ్ చేసేసింది. దీనితో బెంబేలెత్తిపోయిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments