Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కరోనా టీకా వేసిన పారిశుద్ధ్య కార్మికుడు మృతి, అతడికి అవి వున్నాయట

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:36 IST)
తిరుపతి రూరల్ మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీకి చెందిన 49 ఏళ్ల కృష్ణయ్య అనే పారిశుద్ధ్య కార్మికుడు కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత మరణించాడు. మంగళవారం నాడు 11 గంటలకు అతడికి టీకా ఇచ్చారు. అర్థగంట పాటు అక్కడే వున్నాడు. అతడికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో ఇంటికి వెళ్లాడు. 
 
ఐతే బుధవారం తెల్లవారు జామున అతడు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఐతే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
 
కాగా మృతుడికి రక్తపోటు, మధుమేహం సమస్యలు వున్నాయని అతడి కుమారుడు వెల్లడించాడు. తన తండ్రికి టీకా వద్దని చెప్పామనీ, బీపీ, షుగ్ వుందని చెప్పినా వేసారంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. ఐతే కృష్ణయ్య చనిపోవడానికి కారణం టీకానా లేదా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, అప్పటివరకూ అతడు టీకా కారణంగా మృతి చెందాడని చెప్పలేమని వైద్య అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments