Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కరోనా టీకా వేసిన పారిశుద్ధ్య కార్మికుడు మృతి, అతడికి అవి వున్నాయట

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (16:36 IST)
తిరుపతి రూరల్ మల్లంగుంట పంచాయతీ అంబేద్కర్ కాలనీకి చెందిన 49 ఏళ్ల కృష్ణయ్య అనే పారిశుద్ధ్య కార్మికుడు కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత మరణించాడు. మంగళవారం నాడు 11 గంటలకు అతడికి టీకా ఇచ్చారు. అర్థగంట పాటు అక్కడే వున్నాడు. అతడికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో ఇంటికి వెళ్లాడు. 
 
ఐతే బుధవారం తెల్లవారు జామున అతడు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఐతే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
 
కాగా మృతుడికి రక్తపోటు, మధుమేహం సమస్యలు వున్నాయని అతడి కుమారుడు వెల్లడించాడు. తన తండ్రికి టీకా వద్దని చెప్పామనీ, బీపీ, షుగ్ వుందని చెప్పినా వేసారంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. ఐతే కృష్ణయ్య చనిపోవడానికి కారణం టీకానా లేదా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, అప్పటివరకూ అతడు టీకా కారణంగా మృతి చెందాడని చెప్పలేమని వైద్య అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments