Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ ఆకర్ష్ : బీజేపీలోకి చిరంజీవి?

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కమలనాథులు ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక టీడీపీ నేతలు ఆ పార్టీలో చేరారు. వీరిలో ప్రధానంగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు మొదటివరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన సామాజికవర్గమైన కాపు ఓట్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఆ వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని తమతో చేతులు కలిపేలా పాచికలు వీచారు.
 
ఇవి సక్సెస్ కావడంతో చిరంజీవి కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి.. త్వరలోనే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఆయనతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. 
 
చిరంజీవికి కమలనాథులకు మధ్య వారధిగా బీజేపీ నేత రాంమాధవ్ వ్యవహరిస్తున్నారు. తన 151వ చిత్రం ‘సైరా’ విడుదల తర్వాత చిరంజీవి బీజేపీలో ఆయన చేరే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా, ఈ నెల 18న హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. నాంపల్లిలో నిర్వహించే ఈ సభ ద్వారా టీ-టీడీపీ నేతలు పలువురు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments