Webdunia - Bharat's app for daily news and videos

Install App

64 అడుగుల శ్రీ మహావిష్ణువు విగ్రహం-ఎప్పుడు బెంగళూరుకు చేరుకుంటుందో?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (19:14 IST)
300 టన్నులు, 64 అడుగుల శ్రీ మహావిష్ణువు రాత్రి విగ్రహం బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటుందా అని భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వేలాది మంది భక్తుల మధ్య ఈ ఏకశిలా విగ్రహం.. విల్లుపురం నుంచి తిరువన్నామలైకి చేరుకుంది. బెంగళూరుకు వెళ్లే దారిలో ఈ మహావిష్ణువు విగ్రహం తరలివెళ్తోంది. 240 టైర్ల ట్రైలర్‌తో ఈ విగ్రహాన్ని తరలించే ఏర్పాటు చేశారు. 
 
విశ్వరూపంతో కూడిన ఈ మహావిష్ణువు విగ్రహం ప్రస్తుతం సెంజి (విల్లుపురం జిల్లా)లో ఆగింది. ఇక్కడి నుంచి 155 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వుంటుంది. సెంజి మార్గంగా ఈ విష్ణువు విగ్రహాన్ని తీసుకెళ్తే.. పలు గృహాలు కూలిపోయే అవకాశం వుంది. అందుకే ఈ విగ్రహాన్ని వేరే మార్గం ద్వారా తరలించాలని స్థానికులు కోరడంతో ఆ విగ్రహ బరువు మరికొంత తగ్గించేందుకు శిల్పకళాకారులు పనులు మొదలెట్టారు. ఈ విగ్రహాన్ని కోరకోట్టై (వందవాసి తాలూకా, తిరువన్నామలై జిల్లా)లోకి కొండ రాతితో ఏకశిలగా చెక్కారు. 
 
ఈ విగ్రహాన్ని 240 టైర్లతో కూడిన ట్రైలర్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తిరువన్నామలై జిల్లాకు చేరుకున్న ఈ విగ్రహం ఆపై హోసూర్ చేరుకుని అక్కడ నుంచి బెంగళూరుకు చేరుకుంటుందని ముంబై ఆధారిత లాజిస్టిక్స్ సంస్థ చెప్తోంది. ఈ విగ్రహ తరలింపులో 30మంది రెషమ్‌సింగ్ గ్రూప్‌కు చెందిన వారు తలమునకలయ్యారు. జియోలజీ మైనింగ్ శాఖ ఇందుకు 2014లో అనుమతులు ఇచ్చింది. 
 
420 క్యూబిక్ మీటర్లతో సదానంద ట్రస్టు ఆధ్వర్యంలో ఈ రాతి శిల్పాన్ని చెక్కారు. ఏడుతలల ఆదిశేషువుతో కూడిన విగ్రహం బెంగళూరు చేరుకునేందుకు ఒక నెలకాలం పట్టే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈ విగ్రహాన్ని మార్గమధ్యంలోనే భారీ స్థాయిలో భక్తులు దర్శించుకుని పసుపు కుంకుమలను సమర్పించుకుంటున్నారు. 
 
108 అడుగుల శ్రీ మహావిష్ణువు విశ్వరూప విగ్రహాన్ని బెంగళూరులో ప్రతిష్టించాలని ఓ వైద్యుడు సంకల్పించుకుని ఈ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. విగ్రహం బెంగళూరుకు తరలించడంలో భాగంగా కోదండరామస్వామి ట్రస్టుకు సహాయం చేసేందుకు.. తిరువన్నామలై కలెక్టర్‌ ను ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments