Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు... ఇస్రో శాస్త్రవేత్తలకు పదేళ్ళ బుడతడు లేఖ

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (13:03 IST)
చంద్రయాన్-2 ప్రయోగం 95 శాతం సక్సెస్ కాగా, చివరి ఘట్టంలో విఫలమైంది. అయినప్పటికీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తల కృషిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. వారిపై దేశం యావత్తూ ప్రశంసల వర్షం కురుస్తోంది. అదేసమయంలో ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అంటూ పదేళ్ళ బుడతడు ఇస్రో శాస్త్రవేత్తలకు రాసిన లేఖ ఒకటి ఇపుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. 
 
ఆ బాలుడు పేరు ఆంజనేయ కౌల్. అతను రాసిన లేఖలో ఉన్న పూర్తి సారాంశాన్ని పరిశీలిస్తే, 'అంత త్వరగా స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద్రుణ్ని చేరుతాం. వచ్చే జూన్‌లో లాంచ్‌ చేయనున్న 'చంద్రయాన్‌-3' మన లక్ష్యం. ఆర్బిటర్‌ ఇంకా అక్కడే (చంద్రుడి కక్ష్యలో) ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అది మనకు ఛాయాచిత్రాలను పంపిస్తుంది. 
 
మనం ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ విత్తనాలను నాటి మొక్కలు పెంచాలో అదే మనకు చెబుతుంది. విక్రమ్‌ ల్యాండయ్యే ఉంటుంది. ప్రజ్ఞాన్‌ పనిచేస్తూ గ్రాఫికల్‌ బ్యాండ్స్‌ను మనకు పంపించేందుకు సిద్ధమవుతూ ఉండి ఉంటుంది. అదే జరిగితే విజయం మనచేతుల్లోనే. తదుపరి తరం పిల్లలకు ఇస్రో శాస్త్రజ్ఞులే స్ఫూర్తిదాయకం. 'ఇస్రో.. నువ్వు మాకు గర్వకారణం', దేశం తరపున ఇస్రోకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్‌ అంటూ ఉంది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments