పాన్ కార్డులకు కొత్త నిబంధన తీసుకొచ్చిన సీబీడీటీ

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:03 IST)
పాన్ కార్డుకు కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా లేదా డిపాజిట్ చేసినా పాన్ లేదా ఆధార్ నంబరు తప్పనిసరిగా వెల్లడించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదాయపన్ను నిబంధనలు 1962లో పలు సవరణలు తీసుకొచ్చింది. 
 
సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు, విత్ డ్రాయల్స్‌కు కూడా ఈ నిబంధనను వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. కాగా, రోజువారీ బ్యాంకు లావాదేవీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డు నంబరు వెల్లడించాలన్న నిబంధన ఉన్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల మేరకు 18 రకాల లావాదేవీలకు పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సివుంది. వాహనాలు కొనుగోలు లేదా అమ్మకం, బ్యాంకు ఖాతాఓపెన్ చేయడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయడం, హోటల్ లేదా రెస్టారెంట్లలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం, రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో మ్యాచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేయడం వంటి పలు సందర్భాల్లో విధిగా పాన్ నంబరును  సమర్పించాలన్న నిబంధన ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అందరి ఊహలకు అందని చిత్రంగా 'రాకా' : సన్ పిక్చర్స్

ఒకరికి పుట్టినరోజు.. మరొకరికి పునర్జన్మ : పవన్ కళ్యాణ్ సతీమణి

Raaka: అల్లు అర్జున్ #AA22xA6 ఫస్ట్-లుక్ టైటిల్ ఇదే

Venkatesh: ఐదు సినిమాలు చేస్తే చాలనుకున్న నన్ను నిలబెట్టింది వారే : అడివి శేష్

Akhil: అఖిల్ అక్కినేని పుట్టినరోజున లెనిన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments