పాన్ కార్డులకు కొత్త నిబంధన తీసుకొచ్చిన సీబీడీటీ

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:03 IST)
పాన్ కార్డుకు కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా లేదా డిపాజిట్ చేసినా పాన్ లేదా ఆధార్ నంబరు తప్పనిసరిగా వెల్లడించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదాయపన్ను నిబంధనలు 1962లో పలు సవరణలు తీసుకొచ్చింది. 
 
సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు, విత్ డ్రాయల్స్‌కు కూడా ఈ నిబంధనను వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. కాగా, రోజువారీ బ్యాంకు లావాదేవీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డు నంబరు వెల్లడించాలన్న నిబంధన ఉన్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల మేరకు 18 రకాల లావాదేవీలకు పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సివుంది. వాహనాలు కొనుగోలు లేదా అమ్మకం, బ్యాంకు ఖాతాఓపెన్ చేయడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయడం, హోటల్ లేదా రెస్టారెంట్లలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం, రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో మ్యాచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేయడం వంటి పలు సందర్భాల్లో విధిగా పాన్ నంబరును  సమర్పించాలన్న నిబంధన ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments