Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ కార్డులకు కొత్త నిబంధన తీసుకొచ్చిన సీబీడీటీ

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:03 IST)
పాన్ కార్డుకు కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా లేదా డిపాజిట్ చేసినా పాన్ లేదా ఆధార్ నంబరు తప్పనిసరిగా వెల్లడించాలని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదాయపన్ను నిబంధనలు 1962లో పలు సవరణలు తీసుకొచ్చింది. 
 
సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు, విత్ డ్రాయల్స్‌కు కూడా ఈ నిబంధనను వర్తిస్తుందని సీబీడీటీ తెలిపింది. కాగా, రోజువారీ బ్యాంకు లావాదేవీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డు నంబరు వెల్లడించాలన్న నిబంధన ఉన్న విషయం తెల్సిందే. 
 
కాగా, ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల మేరకు 18 రకాల లావాదేవీలకు పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సివుంది. వాహనాలు కొనుగోలు లేదా అమ్మకం, బ్యాంకు ఖాతాఓపెన్ చేయడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయడం, హోటల్ లేదా రెస్టారెంట్లలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం, రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో మ్యాచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేయడం వంటి పలు సందర్భాల్లో విధిగా పాన్ నంబరును  సమర్పించాలన్న నిబంధన ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments