Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరి చిచ్చు : అట్టుడుకుతున్న తమిళనాడు.. 5న రాష్ట్ర బంద్

తమిళనాడులో కావేరి చిచ్చురాజుకుంది. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ జల మండలిని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు బేఖాతర్ చేసింది.

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (10:37 IST)
తమిళనాడులో కావేరి చిచ్చురాజుకుంది. కావేరీ జలాల పంపిణీ కోసం కావేరీ జల మండలిని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు బేఖాతర్ చేసింది. పైగా, కావేరీ బోర్డు ఏర్పాటులో మరింత స్పష్టత కావాలంటూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం గమనార్హం. 
 
ఇది తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలకు ఆగ్రహం తెప్పించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కావేరి జల మండలిని ఏర్పాటు చేయని కేంద్ర ప్రభుత్వ వైఖరిని అధికార పార్టీతో పాటు.. అన్ని విపక్ష పార్టీలు ఎండగడుతున్నాయి. ఈ ఆందోళన భాగంగా, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో 5న రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని నిర్ణయించారు. 
 
ఈ సమావేశం అనంతరం డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్‌.తిరునావుక్కరసర్‌, సీపీఐ, సీపీఎం నేతలు ముత్తరసన్‌, బాలకృష్ణన్‌, డీకే నాయకుడు కె. వీరమణి, డీపీఐ నాయకుడు తొల్‌ తిరుమావళవన్‌, ఆయా పార్టీలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలు చెన్నై వళ్లువర్‌కోట్టమ్‌ వద్ద ఆకస్మికంగా రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. 
 
మరోవైపు, అన్నాడీఎంకేకు రాజ్యసభ సభ్యుడు ముత్తుకరుప్పన్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. కావేరీ జల మండలిని ఏర్పాటు చేయనందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇది అధికార పార్టీకి చెందిన ఎంపీలపై మరింత ఒత్తిడి పెంచినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments