Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిగ్గూశరం ఉంటే చంద్రబాబును చూసి నేర్చుకోండి : స్టాలిన్ ధ్వజం

ఏమాత్రం సిగ్గూశరం రోషముంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సూచి

సిగ్గూశరం ఉంటే చంద్రబాబును చూసి నేర్చుకోండి : స్టాలిన్ ధ్వజం
, బుధవారం, 28 మార్చి 2018 (16:11 IST)
ఏమాత్రం సిగ్గూశరం రోషముంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఏ విధంగా నిలదీస్తున్నారో ఓసారి చూసి తెలుసుకోవాలన్నారు. 
 
తమిళనాడులోని ఈరోడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు కేంద్రం ముందు సాష్టాంగపడి, రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. బలహీనమైన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ చెప్పుచేతల్లో పెట్టుకుందని... తద్వారా తమిళనాడుపై పెత్తనం చెలాయిస్తోందని మండిపడ్డారు.
 
కేంద్ర ప్రభుత్వం ఎదుట సాష్టాంగపడిన, చేవ, తెగువ, వెన్నెముక లేనటువంటి పాలన తమిళనాడులో కొనసాగుతోందని స్టాలిన్ విమర్శించారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేసే విషయంలో తమిళనాడును కేంద్రం వంచిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు ఉన్న తెగువ, స్వాభిమానం, పౌరుషం, పోరాటపటిమ పళని, పన్నీర్ సెల్వంలకు ఎందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

62 ఏళ్ల వృద్ధుడు ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా అక్కడ తాకాడు...