Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారా? పిల్లి బిర్యానీ వస్తుంది.. జాగ్రత్త.. ఎక్కడంటే? (Video)

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (10:38 IST)
చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారా? కాస్త జాగ్రత్త పడండి. విశాఖ హోటళ్లలో పిల్లుల మాంసంతో బిర్యానీ వండుతున్నారనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. భక్తుల ముసుగులో హోటళ్లకు, రెస్టారెంట్లకు పిల్లి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో..  పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. 
 
ఆరుగురు సభ్యులతో కూడిన ఈ ముఠాతో పాటు పోలీసులు వ్యానును కూడా పట్టుకున్నారని సమాచారం. పోలీసులు ఈ వ్యానులో ఒక చనిపోయిన పిల్లితో పాటు ఒక బ్రతికి ఉన్న పిల్లిని గుర్తించారు. చనిపోయిన పిల్లిని పోలీసులు పోస్టుమార్టం కొరకు తరలించారు. ఈ ముఠాలోని సభ్యులు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చినరాజుపాలెంకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది. 
 
ముందుగా రెక్కీ నిర్వహించే ఈ ముఠా పిల్లులను వేటాడి.. ఆ మాంసాన్ని రెస్టారెంట్లకు అమ్ముతుంది. ఈ ముఠాలోని సభ్యులు గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం చినరాజుపాలెంకు చెందిన వ్యక్తులుగా పోలీసుల విచారణలో తేలింది.
 
గతంలో కూడా చెన్నై నగరంలో పిల్లి మాంసం కలిపిన బిర్యాని విక్రయిస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్లే కాకుండా రోడ్డు పక్కన బిర్యానీ అమ్మేవారు ఎక్కువగా పిల్లి మాంసాన్ని చికెన్ ముక్కల్లో కలిపి విక్రయించారనే విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments