పౌరసత్వ బిల్లుకు ఆమోదం.. ముస్లిమేతర మతస్తులకు కూడా పౌరసత్వం

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (12:15 IST)
కేంద్ర మంత్రివర్గం మరో అత్యంత కీలకమైన బిల్లుకు ఆమోదముద్రవేసింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేంద్ర కేబినెట్ సమ్మతం తెలిపింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ దేశాల‌కు చెందిన ముస్లిమేత‌ర మ‌త‌స్తుల‌కు ఈ బిల్లు ద్వారా పౌర‌స‌త్వం క‌ల్పించే అవ‌కాశం కల్పించారు. 
 
ముఖ్యంగా, హిందువులు, క్రిస్టియ‌న్లు, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్సీ వ‌ర్గాల‌కు చెందిన వారికి పౌర‌స‌త్వం క‌ల్పించేందుకు ఈ స‌వ‌ర‌ణ బిల్లును తీసుకొచ్చారు. వ‌చ్చే వారం పార్ల‌మెంట్‌లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. కాశ్మీర్‌లో ర‌ద్దు చేసిన ఆర్టిక‌ల్ 370 త‌ర‌హాలోనే ఈ బిల్లు కూడా ముఖ్య‌మైంద‌ని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. 
 
ఎంపిక చేసిన క్యాట‌గిరీల్లో మాత్ర‌మే అక్ర‌మంగా దేశంలోకి చొర‌బ‌డిన వారికి ఆశ్ర‌యం ఇచ్చేందుకు ఈ బిల్లును తీసుకువ‌స్తున్నారు. హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన స‌మ‌యంలో బీజేపీ స‌భ్యులు అంద‌రూ హాజ‌రుకావాల‌ని ఆ పార్టీ ఆదేశించింది. అయితే, కొన్ని విపక్ష పార్టీలు మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments