Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ చేతిలో అభినందన్.. తమిళనాడుకు చెందిన పైలట్ అట.. ఏం చేస్తారో?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (18:10 IST)
పాకిస్థాన్ విమానాన్ని షూట్ చేసి కూల్చిన భారత వైమానిక దళానికి చెందిన పైలట్ అభినందన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా మంగళవారం భారత వైమానిక దళం.. పాకిస్థాన్‌ భూభాగంలోకి చొరబడి.. జైషే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. 300 మంది ఉగ్రమూకలను హత్య చేశారు. 
 
ఇందుకు ప్రతీకారంగా మూడు పాకిస్థాన్ విమానాలు భారత భూభాగంలోకి బుధవారం చొరబడి.. బాంబును జారవిడిచాయి. ఈ క్రమంలో భారత వైమానిక దళం పాకిస్థాన్ విమానాల్లో ఒకటిని నేలకూల్చింది. మిగిలిన రెండు విమానాలు తప్పించుకుని పారిపోయాయి. ఈ సమయంలో భారత్‌కు చెందిన వైమానిక దళ పైలట్ అభినందన్ అదృశ్యమైనట్లు తెలుస్తోంది. 
 
అభినందన్ పాకిస్థాన్ చేతికి చిక్కాడని వార్తలు వచ్చాయి. కానీ పాక్ సైన్యం చేతిలో అభినందన్ చిక్కుకున్నట్లు వీడియోలు మీడియాలో కనిపించాయి. అరవింద్‌ను తీవ్రంగా కొట్టడం, కళ్లకు కట్టి అతనిని హింసించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
ఈ నేపథ్యంలో అభినందన్ తమిళనాడుకు చెందిన పైలట్ అని చెన్నై మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీడియోలో వున్న పైలట్ తమ బిడ్డేనని.. ఆయన సురక్షితంగా పాక్ నుంచి ఇంటికి చేరుకోవాలని అభినందన్ బంధువు ఒకరు మీడియాతో మాట్లాడారు. కానీ అభినందన్ వ్యవహారంపై.. ఇటు తమిళనాడు సర్కారు నుంచి అటు అభినందన్ కుటుంబీకుల తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments