రోజాతో మాట్లాడిన బాలయ్య, ఇంతకీ ఏ విషయం గురించి...?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (09:43 IST)
బాలయ్య రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. హిందూపూర్ చాలా డెవలప్ చేశాను అందుకే నన్ను మళ్లీ ఎన్నుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఎక్కువ కాలం వుండదు, ప్రజలు తిరగబడతారు. బాల వాక్కు బ్రహ్మ వాక్కు, నేను చెప్పింది జరుగుతది అంటూ వైసీపీ గవర్నమెంట్ పైన బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
ఆనాడు చంద్రబాబు తెలంగాణాను ఎంతో అభివృద్ధి చేశారు. ఆ ఫలాలు ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది అన్నారు. ఏ పార్టీ అధికారంలో వున్నా డెవలప్మెంట్ ముఖ్యం. హిందూపూర్‌లో ఇండస్ట్రీ కారిడార్ కోసం రోజాతో మాట్లాడాను. తప్పకుండా చేద్దాం బాబు అని చెప్పింది అన్నారు.
 
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.... జూనీయర్ ఎన్టీఆర్‌కు సినీ యాక్టర్‌గా బోలెడు భవిష్యత్ వుంది. ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడనేది అతడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. బ్రాహ్మణి రాజకీయాలలోకి వస్తుందనుకుంటున్నారు కానీ.. ఆమె రాజకీయాల్లోకి రాదన్నారు.
 
మల్టీ స్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ... గతంలో ఒకరిద్దరితో కలసి చేయాలనుకున్నాను కానీ... వాళ్ల నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే వాళ్లతో సినిమా చేయాలనే ఆలోచనను విరమించుకున్నాను. ప్రస్తుతం నా ధ్యసంతా బోయపాటి సినిమా మీదనే అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments