Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామాలయానికి కుప్పలుతెప్పలుగా విరాళాలు, రూ. 1500 కోట్లు దాటేసింది...

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (22:17 IST)
అయోధ్య రామాలయం అంచనా వ్యయం రూ. 1500 కోట్లు. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. రానున్న మూడేళ్లలో ఆలయాన్ని అంగరంగవైభవంగా నిర్మించాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణానికి 1500 కోట్లు అవుతాయని అంచనా వేయగా, ఆ మొత్తాన్ని ప్రభుత్వం భరించడం సాధ్యం కాదు కనుక విరాళాలు సేకరించాలని ఆలయ ట్రస్ట్ భావించింది.
ఈ మేరకు విరాళాలు సేకరించాలని నిర్ణయించి, అది కూడా ఫిబ్రవరి 27 వరకు మాత్రమే గడువు విధించారు. దీనితో రామన్న ఆలయానికి మావంతు సాయం అని దేశవ్యాప్తంగా ఎంతోమంది తమ విరాళాన్ని అందించారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ మాజీముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ అయోధ్య మందిరానికి ఏకంగా రూ. 11 లక్షల చెక్కును శనివారం అందించారు.
ఐతే ఈ మొత్తం తను వ్యక్తిగతంగా ఇస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల తరుపున కాదన్నారు. ఎందుకంటే... ఇప్పటికే ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ ఈ విరాళాల సేకరణపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐతే వాటిని పక్కనపెట్టి అపర్ణ విరాళం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఏదేమైనప్పటికీ రాజకీయాలకతీతంగా అయోధ్య రామాలయానికి అనుకున్న మేరకు నిధులు సమకూరాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రూ. 1511 కోట్లు అందినట్లు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. మరో వారం రోజుల సమయం వుంది కనుక ఈలోపు మరెంతమంది తమ విరాళాలను అందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments