Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుగారూ.. ఢిల్లీకి రండి.. రైల్వే జోన్ ఇస్తాం... విత్తమంత్రి ఫోన్

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరోమారు కమలనాథుల నుంచి పిలుపువచ్చింది. ఓసారి ఢిల్లీకి వస్తే కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఆయనకు కబు

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (11:21 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరోమారు కమలనాథుల నుంచి పిలుపువచ్చింది. ఓసారి ఢిల్లీకి వస్తే కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఆయనకు కబురు వచ్చింది. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనకు ఫోన్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ నేతలతో చెప్పారు. ముఖ్యంగా, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సహా విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 
 
అయితే, ప్రత్యేక హోదా గురించి మాత్రం మాట్లాడలేదని... ఇప్పుడు మనం ఏంచేద్దాం అని టీడీపీ నేతలను అడిగారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ, అన్ని విషయాల్లో ప్రజలకు స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇప్పుడు కేంద్ర మంత్రులను మనం కలిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పలువురు వ్యాఖ్యానించారు. యనమల వ్యాఖ్యలతో చంద్రబాబు ఏకీభవించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments